వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు ఉండటంతో ఇటీవల 14 కోడెలు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కీలక నిర్ణయం తీసుకున్నారు. బక్రీద్ తర్వాత 300 కోడె దూడలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు ఉన్న అర్హులైన రైతులు జియో ట్యాగింగ్ ఉన్న చిన్న కోడెలను పొందవచ్చునని చెప్పారు.