23500 metric tons of urea to arrive in Andhra Pradesh in ten days: ఏపీలోని రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే వార్త వినిపించింది. రాష్ట్రంలో యూరియా సమస్యలపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం సుమారుగా 80500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు సీఎంకు వివరించారు. మరో పది రోజుల్లో 23592 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తోందని తెలిపారు. అలాగే కాకినాడ రేవుకు వచ్చే నౌకలో 7 రేక్ల యూరియాను ఏపీకి ఇవ్వాలని కేంద్ర మంత్రిని చంద్రబాబు కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.