Andhra Pradesh Farmers Kapas Kisan App: ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతుల కోసం సీసీఐ కొత్త నిబంధనలు తీసుకురావడంతో, రైతుల వివరాలు నమోదు చేసుకోవడం, స్లాట్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ నిబంధనలపై రైతులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు సీసీఐతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న అఖిల భారత జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.