రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కేంద్ర పథకాలు వర్తించాలంటే రైతులు భూధార్ కార్డు కలిగి ఉండాలని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. జిల్లాల్లోని రైతు వేదికల్లో భూముల వివరాలు నమోదు చేస్తున్నారు. భూధార్ నంబర్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్ యోజన, పంటల బీమా వంటివి పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వ పథకాలకు దీనికి సంబంధం లేదు.