Inam Land Farmers Get Annadata Sukhibhava Rs 10000: ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రెండో విడత డబ్బుల్ని ఇటీవల జమ చేసింది. కానీ అగ్రహారం , ఈనామ్ భూములు సాగు చేసేవారికి రెండో విడత డబ్బులు జమ చేయలేదు. అద్దంకి నియోజకవర్గంలో రైతుల సమస్యల్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీఎం, వ్యవసాయశాఖ మంత్రికి వివరించారు. వారు సానుకూలంగా స్పందించి.. ఆ రైతులకు కూడా నిధులు విడుదల చేశారు. ఇంకా కొందరికి సాంకేతిక సమస్యలతో డబ్బులు అందలేదు, వాటిని పరిష్కరించే పనిలో అధికారులున్నారు.