యాసంగి ధాన్యం కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 8,381 కొనుగోలు కేంద్రాల ద్వారా 19.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రూ.2,289 కోట్లు జమ చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సన్న రకాల ధాన్యానికి ప్రకటించిన బోనస్ మొత్తం రూ.444.20 కోట్లను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అని మంత్రి తెలిపారు.