తెలంగాణలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం లక్ష ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఆదాయం పెంచడానికి, రాష్ట్రంలో పండ్లు, కూరగాయల కొరతను తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయి. చిన్న రైతులకు ఐదు ఎకరాల వరకు సబ్సిడీని పెంచారు.