పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, భారత్లో ధరల పెంపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో 61.14 లక్షల టన్నుల యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. దిగుమతుల కోసం రష్యా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ దేశాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. తెలంగాణలో వానాకాలం సీజన్ దృష్ట్యా అదనపు కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అలాగే భూసార రక్షణ కోసం నానో, జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.