తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు అందిస్తున్న ప్రభుత్వం.. రైతుబీమా, ఫసల్ బీమా యోజన వంటి పథకాలను కూడా అమలు చేస్తోంది. తాజాగా రైతుల ఆదాయం పెంచేందుకు మంత్రి తుమ్మల కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని ప్రతీ జిల్లాలో ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.