ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో వలసలు తగ్గించేందుకు.. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు పలు పనులు చేపడుతున్నారు. వందశాతం రాయితీపై ఇచ్చే పశువుల పాకలు, మేకలు, గొర్రెల షెడ్లు, కోళ్ల షెడ్లు, అజోలా పెంపకం, వర్మీ కంపోస్ట్ గుంతలు, ఇంకుడు గుంతల వంటి పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పీడీ రఘువరన్ తెలిపారు. ఈ పనులకు మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించారని, అర్హులైన రైతులు ఉపాధి సిబ్బందికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.