రైతులకు శుభవార్త.. గతేడాది కన్నా ఎక్కువ చెల్లింపు.. మంత్రి కీలక ప్రకటన

6 months ago 26
ఏపీలో ధాన్యం రైతులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 48 గంటల్లోనే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. అలాగే ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం 14 వేలకోట్ల రూపాయలు సిద్ధం ఉంచుకుందన్నారు. గతేడాది కంటే 72 రూపాయలు అధికంగా మద్దతు ధరను రైతులకు అందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.
Read Entire Article