తెలంగాణ రైతులకి ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వరదలు, వర్షాల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ భూములను బాగు చేయడానికి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దీని ద్వారా ఉపాధిహామీ కార్మికులు రైతుల పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించి.. భూమిని తిరిగి సాగుకు అనుకూలంగా మారుస్తారు. ఈ నిర్ణయం వల్ల అన్నదాతలకు చాలా మేలు కలుగుతుంది అంటున్నారు.