AP Farmers Can Use Nano Urea: ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వేడి రాజుకుంటున్న వేళ, ప్రభుత్వం రైతులకు నానో యూరియాను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూరియా బస్తాల మోత ఇక ఉండదు. కేవలం అర లీటరు నానో యూరియాతోనే ఎకరానికి సరిపోతుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో పాటు పంటలకు పోషకాలను అందిస్తుంది. దీని వాడకంపై వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది నానో యూరియా వాడకం పెరిగింది.