సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు జరుగుతున్నందున అక్టోబరు 19 వరకు పలు రైళ్ల రాకపోకలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిలిపివేశారు. కొన్ని రైళ్లను కాచిగూడ, ఉందానగర్, మల్కాజ్గిరి, హైదరాబాద్, చర్లపల్లి స్టేషన్లకు మళ్లించారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైల్వే వెబ్సైట్లు లేదా హెల్ప్లైన్ల ద్వారా ట్రైన్ల వివరాలను తెలుసుకోవాలని సూచించారు.