Srikakulam District Three New Train Halts Started: శ్రీకాకుళం జిల్లాలోని మూడు రైళ్లకు కొత్తగా హాల్ట్ ప్రారంభమైంది. మందస రైలు నిలయంలో బ్రహ్మపురం- విశాఖ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ప్రారంభించారు. హరిశ్చంద్రపురంలో విశాఖ – గుణపూర్ పాసింజర్ రైలు, పాతపట్నం లో రూర్కెల – గుణపూర్ రాజ్యరాణి రైళ్ల హాల్ట్లను ప్రారంభించారు. అలాగే త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు నడిచేలా కృషి చేస్తానన్నారు రామ్మోహన్.