తెలంగాణలోని మంచిర్యాల రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్-నాగపూర్ వందే భారత్ రైలుకు హాల్టింగ్ సౌకర్యం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. మంచిర్యాలలో రూ. 3.5 కోట్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా అమృత్ భారత్ పథకం కింద మంచిర్యాల స్టేషన్ను రూ. 26 కోట్లతో విమానాశ్రయంలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.