దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని మధ్య రైల్వే ముంబయి-కరీంనగర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ రైలు ఈ నెల 30 నుంచి నవంబరు 25 వరకు ప్రతి మంగళవారం ముంబయి నుంచి, బుధవారం కరీంనగర్ నుంచి అందుబాటులో ఉంటుంది. కోరుట్ల, మెట్పల్లి మీదుగా వెళ్లే ఈ రైలు పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది.