రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాల్లో మూడు స్టేషన్లలో పలు రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించింది. కరోనా సమయంలో ఇక్కడ ఆయా రైళ్లకు స్టాపింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడటంతో స్టాపింగ్ అవకాశం కల్పిస్తున్నారు. వీటిలో రాజంపేట, నందలూరు, కోడూరు రైల్వేస్టేషన్లు ఉన్నాయి.