రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం కాజీపేట- విజయమ మధ్య మూడో రైల్వే పనులు చకచకా సాగుతున్న నేపథ్యంలో.. ఖమ్మం మీదుగా నడిచే 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. రద్దయిన రైళ్లలో కొన్నింటిని నిర్ణీత తేదీల్లో నడిపేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.