రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొన్ని రైళ్ల షెడ్యూల్లను మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక కొన్ని రోజుల్లో నడిచే రైళ్లను రద్దు చేసి ఇతర రోజుల్లో నడపనున్నట్లు వెల్లడించింది. అయితే పలు వందే భారత్ రైళ్ల షెడ్యూల్లలో మార్పులు చేర్పులు జరిగినట్లు వెల్లడించింది. రైల్వే బోర్డు ఇచ్చిన ఆమోదం మేరకు పలు రైళ్ల షెడ్యూల్ను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.