Secunderabad Tirupati Vande Bharat Piduguralla Halt: ఏపీలో మరో వందేభారత్ రైలు ఆపేందుకు సానుకూలత వచ్చింది. పల్నాడు జిల్లా ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ప్రెస్ పిడుగురాళ్లలో ఆపేలా రిక్వెస్ట్ చేశారు. త్వరలోనే శుభవార్త రాబోతోందని రైల్వే బోర్డు సభ్యురాలు కొంకా రాధ తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. మరిన్ని రైళ్ల స్టాపింగ్లు, నూతన రైల్వే మార్గాలపై కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.