సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా నడిచే రైళ్ల వేళల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. రామేశ్వరం నుంచి సికింద్రాబాద్కు వచ్చే ప్రత్యేక రైలు జూన్ 13, 20, 27 తేదీలలో ఉదయం 9:15 గంటలకు బదులుగా రాత్రి 7:00 గంటలకు బయలుదేరుతుంది.. అంటే 19 గంటల 50 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. దీంతో పాటు.. 37 ఎక్స్ప్రెస్ రైళ్ల షెడ్యూల్స్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణం సులభంగా ఉండేందుకు రైలు వేళలను ముందుగానే ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు.