రైల్వే ప్రయాణికులకు అలర్ట్. విశాఖ కిరండోల్ ప్యాసింజర్ రైలు సర్వీసులో చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. కేకే లైనులో ఆధునికీకరణ పనుల కారణంగా నాలుగు రోజుల పాటు విశాఖ కిరండోల్ ప్యాసింజర్ రైలు.. అరకులోనే నిలిపివేయనున్నారు. డిసెంబర్ 23, 27తో పాటుగా జనవరి 3,5వ తేదీలలో ఈ రైలును అరకులోనే నిలిపివేస్తామని.. అక్కడి నుంచే తిరుగు ప్రయాణం మొదలవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.