సికింద్రాబాద్ నుంచి నడిచి పలు రైళ్లను రద్దుచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 30 రైళ్లు రద్దుచేశామని, మరికొన్నింటిని వేరే మార్గంలో మళ్లించినట్టు పేర్కొంది. విజయవాడ ఈ మార్గంలోని నాన్- ఇంటర్లాకింగ్ పనుల జరుగుతున్న నేపథ్యంలో ఈ రైళ్లు అందుబాటులో ఉండవని తెలిపింది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని వివరించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 11 రోజుల పాటు కొన్ని రైళ్లు రద్దయ్యాయి.