కేరళ, తమిళనాడుకు వెళ్లే ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే తీపి కబురు చెప్పింది. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి నడిచే పలు ప్రత్యేక వీక్లీ ట్రైన్లను అక్టోబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. అదనంగా 38 ట్రిప్పుల ప్రత్యేక ట్రైన్లను కూడా నడపనున్నట్లు చెప్పారు.