Guntur Three Star Facilities For Railway Track Maintenance Teams: రైల్వే ట్రాక్ల నిర్వహణ సిబ్బంది కోసం దక్షిణ మధ్య రైల్వే సరికొత్త ఆలోచన చేసింది. గుంటూరులో త్రీస్టార్ హోటల్ తరహా వసతులతో జనరల్ బోగీలను రూపొందిస్తోంది. ఇందులో సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సోఫాలు, ఏసీ గదులు, వంటగది, స్నానపు గదులు వంటి సౌకర్యాలు ఉన్నాయి. అత్యవసర సమయాల్లో సిబ్బందిని ఈ బోగీల ద్వారా ట్రాక్ల వద్దకు తరలించి మరమ్మతులు చేయిస్తారు. ఇప్పటికే 22 ఆధునిక కోచ్లను తయారు చేశామని అధికారులు తెలిపారు.