మొన్నటివరకు తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో గర్భిణీలు ప్రసవించిన ఘటనలు చూశాం. కాగా.. తాజాగా రైల్వే స్టేషన్లోనే గర్భిణీ ప్రసవించింది. ఈ ఘటన హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగింది. హైదరాబాద్లోని దుండిగల్లో ఉంటున్న ఒడిశాకు చెందిన దంపుతులు.. విశాఖపట్నం వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వెళ్లగా.. అదే సమయంలో మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో.. అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఆమెకు పురుడుపోసి మానవత్వం చాటుకున్నారు.