ప్రధాని నరేంద్ర మోదీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ప్రారంభించిన పథకాల్లో ఒకటి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. మే 9వ తేదీన మోదీ కలకత్తాలో దీనిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంపై అవగాహన లేక చాలా మంది తీసుకోవడం లేదు. అతి తక్కువ ప్రీమియంతో దీనిలో చేరవచ్చు. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ పథకంపై అవగాహన కల్పించి దీనిలో చేరేలా ప్రోత్సహిస్తున్నా.. ఇంకా చాలా మందికి వీటి గురించి తెలియడం లేదు. దీనిపై నిజామాబాద్ తపాలా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.