తెలంగాణలో మహిళలను ధనవంతులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజాభవన్లో.. ఆమెతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి మహిళలకు చేపల అమ్మకాల కోసం 36 వాహనాలను పంపిణీ చేశారు. గతంలో ఇచ్చిన వాహనాలతో మహిళలు రోజుకు రూ. 8,000 వరకు సంపాదిస్తున్నారని.. ఇది వారికి మంచి ఆదాయాన్ని ఇస్తోందని అన్నారు. పెట్రోల్ బంకులు, సోలార్ వ్యాపారాలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లతో సహా 20కి పైగా ఇతర వ్యాపారాల్లో కూడా మహిళలకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని ఆమె చెప్పారు.