నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఏ రాజేష్ నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవటంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి కర్నూలుకు చేరుకున్న ఎంపీ శబరి.. రాజేష నాయుడు మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఓదార్చి.. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. రాజేష్ నాయుడు గత 20 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబం వద్ద పనిచేస్తున్నారు. ఆయన చనిపోవటంతో కుటుంబ సభ్యుణ్ని కోల్పోయినట్లు ఉందని ఎంపీ బైరెడ్డి శబరి ఎమోషనల్ అయ్యారు.