రోహిత్ రెడ్డి ఫామ్హౌస్ కేసులో కొకైన్ను హైదరాబాద్లోనే కొనుగోలు చేసినట్లు నిందితుడు శరత్ అంగీకరించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చామన్న ముందు చెప్పిన అది అబద్ధమని తేలింది. నగరంలోనే అభిషేక్ సింగ్ అనే పెడ్లర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయగా.. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. నిందితుల ఫోన్ డేటా విశ్లేషణ ద్వారా మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయని అధికారులు చెబుతున్నారు.