లింగ నిర్ధారణ పరీక్షలో ఆడపిల్ల అని తేలింది.. అబార్షన్ చేయించుకునే సమయంలో ఊహించన ఘటన..

9 months ago 30
సూర్యాపేట జిల్లాలో గర్భస్రావం వికటించి ఒక మహిళ మరణించడంతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిరేకల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు జరిగాయని తెలిసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో, మూడో కాన్పులో అబ్బాయి కోసం లింగ నిర్ధారణ చేయించుకున్నారు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించారు. ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించగా, అక్కడ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article