case on lady aghori: లేడీ అఘోరీగా పేరుగాంచిన వ్యక్తి చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే మోసాల కేసులో రిమాండ్లో ఉండగా, కరీంనగర్లో అత్యాచారం కేసు నమోదైంది. సనాతన ధర్మం పేరుతో పరిచయం పెంచుకుని, కొండగట్టులో తాళి కట్టి, అత్యాచారయత్నం చేసిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, బెదిరించి రూ.3 లక్షలు తీసుకుందని ఆరోపించింది. దీని గురించి బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిందని ఆరోపించింది. ఈ కేసుతో అఘోరీ మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అంటున్నారు.