మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో కీలక నేత కేశాలు కూడా ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రూ. 1.93 కోట్ల ప్యాకేజీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెల్త్ కార్డులు అందజేయనున్నట్లు డీజీపీ చెప్పారు. గత 18 నెలల్లో 763 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. అగ్రనేత గణపతి బతికే ఉన్నారని డీజీపీ స్పష్టం చేస్తూ.. అడవుల్లో ఉన్న మిగిలిన వారు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు.