టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్ కెరీర్ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా ఇంకా చాలలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు ఇకనైనా నారా లోకేష్ చేతికి అప్పగించాలని.. లేకపోతే అతని రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు.