ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తి చూపడంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల్లో ఏపీలో సౌరశక్తి, మైక్రో ఇరిగేషన్, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మహీంద్రా గ్రూప్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈవీ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు రాయితీలు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.