హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో దెబ్బతిన్న గ్యాస్ పైపును వాడటం వల్ల గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. వంట చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి స్పల్పంగా గాయపడ్డాడు. నాణ్యత లేని, దెబ్బతిన్న గ్యాస్ పరికరాలు ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతాయని అధికారులు చెబుతున్నారు. గ్యాస్ పైప్, రెగ్యులేటర్, స్టవ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని ఏమాత్రం దెబ్బతిన్నా అలాగే వాడకుండా రిప్లేస్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.