తెలంగాణలోని భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. మహేశ్వరం ప్రాంతంలో అక్రమంగా భూములు అమ్మకాలు జరిపిన మునావర్ ఖాన్, ఖదీర్ ఉన్నిసా.. వారి అనుచరుల ఇళ్లలో తనిఖీలు చేశారు. దాదాపు వంద ఎకరాల భూమి అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను కూడా ఈడీ విచారించింది. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.