రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఉండేవారు వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే లోపలేస్తామంటూ ఎంఐఎం ఎమ్మెల్యేలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. రైతు భరోసా వాయిదాలు, మూసీ నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా, కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, నిధుల మళ్లింపుపై ఆరోపణలు చేశారు.