2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన వైఎస్సార్సీపీ.. 2024 ఎన్నికల్లో మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. అయినా సరే ఆ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉంది.దీంతో వచ్చే ఎన్నికల నాటికి తన ఓటు బ్యాంకును మరింత పెంచుకోవడం మీద వైఎస్సార్సీపీ ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టింది. ఏపీలో ప్రధాన సామాజికవర్గమైన కాపులతోపాటు క్రిస్టియన్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. మావిగన్ నినాదాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తోంది.