మంత్రి నారా లోకేష్కు యూట్యూబర్ నా అన్వేషణ ఒక కీలక విజ్ఞప్తి చేశాడు. అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణమైన స్థితిలో ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మాత్రం అక్షరాస్యతలో ఏపీ.. ఇప్పుడు ఉన్న స్థితిలో ఉండకూడదని తెలిపాడు. ఇక ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు కూడా విద్యపై చాలా ఖర్చు పెడుతున్నాయని.. కానీ భారత్ మాత్రం చదువుపై తక్కువగా ఖర్చు చేస్తోందని ఆరోపించాడు.