బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రపై స్పష్టత ఇచ్చారు. పాదయాత్ర చేస్తానని గతంలోనే కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా, దీనిపై మరోసారి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆయన తరుచూ విమర్శలు గుప్పిస్తోన్న విషయం విదితమే. గురువారం సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కేసీఆర్ లేకుంటే తెలంాణ లేదన్నారు.