వరంగల్ ఎంజీఎంలో విస్మయకర ఘటన.. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నాడు

1 year ago 27
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి మరణించాడని భావించి, ఆయన కుటుంబానికి మరొకరి మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యులు దహన సంస్కారాలకు సిద్ధమవుతుండగా.. మృతదేహం తమవారిది కాదని, చేతిపై ఉన్న పచ్చబొట్టు లేదని గుర్తించారు. అసలు ట్విస్ట్ ఏంటంటే కుమారస్వామి బతికే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎంజీఎం ఆసుపత్రిలోని ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు? ఈ పొరపాటు ఎలా జరిగిందనే దానిపై విచారణ జరుగుతోంది. ఈ ఘటన ఆసుపత్రి, పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
Read Entire Article