తెలంగాణలోని వరంగల్ రైల్వే స్టేషన్ రూ.25.41 కోట్లతో అమృత్ భారత్ పథకం కింద అత్యాధునికంగా అభివృద్ధి చెందుతోంది. 90% పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మెరుగైన సౌకర్యాలు, ఆధునిక భవనంతో ఎయిర్పోర్టు తరహాలో రూపుదిద్దుకుంటోంది. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.