భారత రాష్ట్ర సమితి పార్టీ (ఒకప్పటి TRS) 25వ వార్షికోత్సవాన్ని వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఘనంగా నిర్వహిస్తోంది. 10 లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్ష సూచనలు ఉండటంతో సభపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్కతుర్తిలో ఆకాశం మేఘావృతమై ఉండగా.. బీఆర్ఎస్ శ్రేణులు వర్షం కురవకుండా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్ సభా వేదికకు చేరుకుని ప్రసంగించనున్నారు.