తెలంగాణలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. వరద ప్రవాహం కారణంగా చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లి రవాణా స్తంభించింది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లే దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూరప్రయాణాలు చేసే వారు తమ యాత్రలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు కష్టాలు పడుతుండగా, స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అసంతృప్తి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే రమణా రెడ్డి స్పందించారు.