రాష్ట్రంలో వరి సాగుకు బదులుగా డిమాండ్ ఉన్న ఇతర పంటల వైపు మళ్లేలా రైతులకు ప్రోత్సాహకాన్ని అందించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. పంట మార్పిడిని ప్రోత్సహించడం, వరి పంట సాగును తగ్గించడమే లక్ష్యంగా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం పంజాబ్లో అమలు అవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి.. రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపై ప్రతిపాదనలు చేస్తోంది.