ఆంధ్రప్రదేశ్ ప్రజీలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పంట పొలాల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని.. పండిన ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.