నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం చిన్నాయనం గ్రామ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో భారీ చేప లభ్యం అయింది. ఉదయం ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో మత్స్యకారుల వలకు 34 కిలోల బొచ్చ చేప చిక్కింది. దీంతో ఆ మత్స్యకారులతో పాటు గ్రామస్తులు అంతా అక్కడికే పరుగులు పెట్టారు. ఆ పెద్ద చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. దానిని పట్టుకున్న మత్స్యకారులకు మాత్రం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా సంతోషంగా ఉన్నారు.