ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మంటలం ధరంపూరి గవర్నమెంట్ స్కూల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాలలోని 30 మంది విద్యార్థులను చంపడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. నీటి ట్యాంక్లో పురుగుల మందు కలపడంతో పాటు, మధ్యాహ్న భోజనం వండే పాత్రలపై కూడా విషం చల్లారు. సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.